కోర్టూ బాష మార్చనున్న మోదీ దానికి సహకరించిన రమణ

In Indian Courts Changes Regional Language: (కోర్టూ బాష మార్చనున్న మోదీ దానికి సహకరించిన రమణ) 

భారత దేశం ప్రపంచములోనే అతి దేశం. అందులోను అతి పెద్ద ప్రజాస్వామ మరియు అతి పెద్ద మరియు క్లిష్ట రాజ్యాంగము కలిగిన దేశం. అంబేద్కర్ వంటి మహనీయులు లేకపోతే ఈ దేశములో ఇంత నాగరికత చెందేది కాదు.

ఇక విషయానికి వస్తే భారత దేశం లో న్యాయ స్తానాల భాద్యత చాల ముఖ్యమైనది. అందులోను భారత సుప్రిం కోర్ట్ అవి అందించే సలహాలను ఇక మన దేశములో ఉన్న అన్ని రాష్ట్ర న్యాయ స్తానాలు ఖచ్చితముగా పాటించాలి.

ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలపై శాసన, న్యాయవ్యవస్థల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, రెండు వ్యవస్థలూ పరస్పర సహకారంతో ముందుకు వెళితేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఉద్ఘాటించారు.

కేంద్ర న్యాయ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని విగ్యాన్ భవన్ లో శనివారం నాడు సుప్రీంజడ్జిలు, హైకోర్టు సీజేలు, రాష్ట్రాల సీఎంలతో ఉమ్మడి సదస్సును మోదీ, రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని.. కోర్టుల్లో వాడుతోన్న భాషపై కీలక కామెంట్లు చేయగా, ప్రభుత్వాలే కోర్టు ధిక్కారాలకు పాల్పడుతోన్నవైనాన్ని సీజేఐ ఎత్తి చూపారు.

కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టుల సీజేలు, పలు రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.కోర్టు(న్యాయ) భాష సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలని ప్రధాని మోడీ అన్నారు.

కోర్టుల్లో న్యాయ వ్యవహారాలన్నీ ఇంగ్లిష్‌లోనే జరుగుతున్నాయని, అలాకాకుండా స్థానిక భాషలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. స్థానిక భాషలతో సామాన్యులకు న్యాయవ్యవస్థలపై విశ్వాసం పెరుగుతుందనన్నారు.

ఇవే కాక ఇంకా చదవండి

  1. పెట్రోల్, డీజిల్ ధరలపై మోడీ కీలక వ్యాక్యాలు !
  2. పిల్లల వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధాని మోడీ !

Related Articles

Latest Articles