దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు !

దేశంలో కరోనా తీవ్రత క్రమంలో పెరుగుతోంది. రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు పెరగడం కలవరపాటుకు గురిచేస్తోంది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,927 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 32 మంది మృతిచెందారు. మరో 2,252 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

కరోనా మహమ్మారి నుంచి విముక్తి ఎప్పటికి లభిస్తుందో తెలియని పరిస్థితి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఎందుకంటే జూన్ చివరివారం నాటికి దేశంలో కరోనా ఫోర్త్‌వేవ్ ప్రారంభమై..సెప్టెంబర్ వరకూ ఉంటుందని ఇప్పటికే కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు స్పష్టం చేశారు.

అదే సమయంలో కరోనా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఓ దశలో రోజుకు 5 వందలకు పడిపోయిన కేసుల సంఖ్య ఇప్పుడు మళ్లీ 3 వేలకు చేరుతోంది. కాన్పూర్ ఐఐటీ చెప్పింది నిజమేనా..కరోనా ఫోర్త్‌వేవ్ ప్రారంభం కానుందా అనే కలవరం కలుగుతోంది.

గత 24 గంటల్లో దేశంలో  2 వేల 927 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే  దాదాపు 450 కేసులు అధికం. అదే సమయంలో 32 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. దేశంలో ప్రస్తుతం 16 వేల 279 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

పాజిటివిటీ రేటు 0.58 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకూ 4 కోట్ల 30 లక్షల 65 వేల కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 5 లక్షల 23 వేల 654కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.75 శాతముంది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16,279 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొం‍ది. ఇదే సమయంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.58 శాతంగా నమోదు అయింది. మరోవైపు.. దేశంలో ఇప్పటివరకు 4,30,65,496 కరోనాబారినపడ్డారు. కోవిడ్ సంబంధిత మరణాల సంఖ్య 5,23,654 కు చేరుకుంది. ఇక, ఇప్పటి వరకు దేశవ్యాప‍్తంగా 1,88,19,40, 971 మందికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి అయ్యింది.

ఇదిలా ఉండగా.. దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజా పరిస్థితి, కోవిడ్‌ నియంత్రణ చర్యలపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ బుధవారం మధ్యాహ్నాం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

రోజురోజుకీ పెరుగుతుండటంతో కొన్ని రాష్ట్రాలు మరోసారి మాస్క్ ధారణ తప్పనిసరి చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. కరోనా నియంత్రణ, తీసుకోవల్సిన చర్యలు, వ్యాక్సినేషన్ అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ సహా పొరుగు రాష్ట్రాల్లో కరోనా నియంత్రణ చర్యలు కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Related Articles

Latest Articles