కరోనా రాను రాను పెరుగుతూనే ఉంది. ఇప్పటి దాక తాగానే లేదు, అయితే మొదటి నుండి ఎప్పటి దాక వరుసుగా కేసు లు పెరుగుతున్నాయికానీ తగ్గలేదు. ఫోర్త్ వేవ్ రావడం వలన మనషుల్లో ఇంకా భయనదోలన ఎక్కువగా ఉంది. ఫోర్త్ వేవ్ వివిధ ప్రాంతాలలో రావడం జరిగింది. అలాగే మరణాలు కూడా ఎక్కువ గ ఉన్నాయి. ఎక్కువగా ఢిల్లీ, హర్యానా వంటి ప్రేదేశాలలో ఎక్కువగా ఉంది. దిని వలన మనషు లకు తొందరగా సోకే అవకాశం ఉంది అని వైదులు తెలియచేస్తున్నారు.
ప్రధాని మోడీ కీలక అంశాలు :
గత రెండు వారాలుగా దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వర్చువల్గా సమావేవమయ్యారు. ఈ సందర్భంగా ఒమిక్రాన్ సబ్-వేరియంట్లతో ముప్పు పొంచి ఉందని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గత రెండు వారాలుగా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్ వ్యూహంతో తొలి దశలోనే వైరస్ను నియంత్రించాలని పేర్కొన్నారు. ప్రికాషనరీ డోస్పై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహ అర్హులైన ప్రతి ఒక్కళ్లూ కరోనా నుంచి తమను తాము రక్షించుకోడానికి తప్పనిసరిగా బూస్టర్ డోస్ తీసుకోవాలన్నారు. సుదీర్ఘకాలం తర్వాత స్కూల్స్ తెరుచుకోవడం వల్ల కేసులు సంఖ్య పెరుగుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
కానీ, 6-12 ఏళ్లలోపు చిన్నారకు కొవాగ్జిన్ టీకాను ప్రారంభించనుండటం శుభపరిణామమని మోదీ చెప్పారు. దేశంలో ప్రతి రాష్ట్రం, జిల్లా, గ్రామానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేరువయ్యింది… దేశంలోని 96 శాతం మంది తొలిడోస్ తీసుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. అలాగే 85 శాతం మంది రెండు డోస్లు తీసుకున్నారని వివరించారు.